రాజకీయాల్లోకి ఎంతో మంది నాయకులు వస్తుంటారు..పోతుంటారు…కానీ కొంత మంది నాయకులు మాత్రమే ప్రజల మనసులో నిలుచుంటారు. అలా ప్రజల మనసులో నిలిచిపోయిన నాయకులు నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పొచ్చు. కేవలం నాయకుల్లా కాకుండా.. ప్రజా నాయకుల్లా వారు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి వారిద్దరి బయోపిక్ లు ఇప్పుడు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
క్రిష్ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే రెండు భాగాలుగా తెరకెక్కిన ఈసినిమాలో మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు ఇటీవలే రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పార్ట్ లో ఎన్టీఆర్ సినీజీవితం గురించి చూపించారు. అయితే దానికి ఆశించినంత విజయం దక్కలేదనే చెప్పొచ్చు. ఇక రెండో పార్ట్ ఎన్టీఆర్ మహా నాయకుడు ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ. కొన్ని పరిస్థితుల కారణంగా అది కాస్త ఫిబ్రవరి 14 కు వాయిదా వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఎన్టీఆర్ సినీ జీవితం కంటే.. కాస్త రాజకీయ జీవితంలోనే ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి కథానాయకుడు కంటే మహానాయకుడు బాగానే ఉంటుందన్న అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి.
ఇక మహి.వి రాఘవ్ దర్శకత్వంలో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మమ్ముట్టి ప్రథాన పాత్రలో తెరకెక్కుతున్న ఈసినిమా ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ కాబోతుంది. మరో పక్క ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్స్ నుండి టీజర్ వరకూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోయారని.. అచ్చం అలానే ఉన్నారన్న ప్రశంసలు లభిస్తున్నాయి.
దీంతో రెండు సినిమాలకు గట్టి పోటీ ఏర్పడే అవకాశమే ఉన్నట్టు కనిపిస్తోంది. అటూ ఇటుగా ఒకేసారి రెండు బయోపిక్ లు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఏ సీఎం మళ్లీ గెలుస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరు లెజెండరీ ముఖ్యమంత్రుల మధ్య బాక్సాఫీస్ పోరు ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందర్లోనూ కనిపిస్తుందిప్పుడు. మరి చూద్దాం ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లో ఏ సినిమాకు ప్రజలు ఓట్లేసి మళ్లీ గెలిపిస్తారో…!
[youtube_video videoid=S3loZSy9uco]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: