`ఫిదా`, `ఎంసీఏ` చిత్రాలతో తెలుగునాట సంచలనం సృష్టించిన టాలెంటెడ్ బ్యూటీ సాయిపల్లవి. తన నటన, నర్తనతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్న ఈ నేచురల్ బ్యూటీకి గత ఏడాది మాత్రం ఆశించిన విజయాలు దక్కలేదు. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న `పడి పడి లేచె మనసు` పల్లవిని తీవ్ర నిరాశపరిచింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా… విజయ తీరాలకు చేరుకోలేకపోయింది. ముఖ్యంగా… ఈ సినిమా నిర్మాతలు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో… ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఈ సినిమా విడుదలకు ముందు సాయిపల్లవికి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ లో సగానికి పైగా మొత్తాన్ని చెల్లించిన నిర్మాత సుధాకర్ చెరుకూరి… విడుదల తరువాత సినిమా ఫలితం నిరాశపరిచినా ఆమెకు ఇవ్వాల్సిన మిగిలిన రూ.40 లక్షల మొత్తాన్ని కూడా ఇచ్చేందుకు ప్రయత్నించాడట. అయితే… సినిమా ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో… సాయిపల్లవి నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించిందట. దీంతో… సాయిపల్లవి తల్లిదండ్రులను ఫోన్లో సంప్రదించి మిగిలిన మొత్తాన్ని తీసుకోవాల్సిందిగా కోరగా… వాళ్ళు కూడా సాయిపల్లవి అభిప్రాయాన్ని గౌరవిస్తూ నిరాకరించారట.
సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా… తమకు రావాల్సిన మొత్తాన్ని ముక్కుపిండి మరీ వసూల్ చేస్తున్న నేటి తారల మధ్య… సాయిపల్లవి ఉదారత నిజంగా అభినందనీయమే. అలాగే… సినిమా ఫలితాన్ని నెపంగా చూపి పారితోషికాన్ని ఎగ్గొట్టాలనే నిర్మాతల మధ్య ఇలాంటి నిర్మాతలు ఉండడం కూడా మెచ్చుకోదగ్గ విషయం. శ్రమను గౌరవించి పారితోషికాన్ని పూర్తిగా ఇవ్వాలనుకునే నిర్మాతలు… నష్టాల్లో ఉన్న నిర్మాతల పరిస్థితిని గమనించుకుని వారిని మరింతగా ఇబ్బంది పెట్టని నటీనటులు ఉన్నంత కాలం పరిశ్రమ ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది. హ్యాట్సాప్ టు సాయిపల్లవి అండ్ `పడి పడి లెచె మనసు` ప్రొడ్యూసర్స్!
[youtube_video videoid=bCITH3-eaRs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: