గత ఏడాది వేసవికి `భరత్ అనే నేను`తో బ్లాక్బస్టర్ హిట్ను అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు… ఈ ఏడాది వేసవికి `మహర్షి`తో పలకరించనున్నాడు. అంతేకాదు… ఈ సినిమాతో కథానాయకుడిగా 25 చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ని ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్, `దిల్` రాజు, ప్రసాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న `మహర్షి` తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే… ఈ చిత్రం విడుదలయ్యాక తన కుటుంబంతో కలసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయనున్న మహేష్… జూన్ నుంచి తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడని టాలీవుడ్ టాక్. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. `రంగస్థలం` తరువాత సుకుమార్ – మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో వస్తున్న సినిమా కావడం… అలాగే కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండడంతో… ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడతాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=GPU0CAGGzAU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: