అమ్మ లేని లోటు అనేది అమ్మ లేని వారికి మాత్రమే అర్థమవుతుంది. అందుకు ఎవరూ మినహాయింపు కాదు. తాజాగా జాన్వీ కూడా తన తల్లి శ్రీదేవిని తలుచుకుంటూ ఎమోషనల్ అయింది. తన అందం, అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొని.. అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఇక అలనాటి అందాల తార శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ సినీ ఎంట్రీ ఇచ్చింది. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. అయితే జాన్వీ శ్రీదేవి ని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అమ్మా నేను ఇప్పటికీ నీకోసం వెతుకుతూనే ఉన్నాను, నేను వెళ్లే ప్రతి చోటు, నేను చేసే ప్రతి పని నీతోనే మొదలవుతుంది, అలానే నేను చేసే ప్రతి పని నువ్వు గర్వించేలా చేయడానికి ప్రయత్నిస్తాను అంటూ ఎమోషనల్ గా పిక్ ను పోస్ట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
కాగా ప్రస్తుతం జాన్వీ కపూర్ హిందీలో తన కెరీర్ ను బాగానే కొనసాగిస్తుంది. ధఢక్ మూవీ ద్వారా బాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత నుండి ఒక్కో సినిమాతో మంచి సక్సెస్ లతో పాటు నటిగా ఆడియన్స్ నుండి మంచి ఆదరణనే సొంతం చేసుకుంటుంది. ఇక ఇటీవల మిలి ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మరొక విజయం అందుకుంది. జాన్వీకపూర్ ప్రస్తుతం బవాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో బవాల్ చిత్రీకరణ పూర్తవగా.. మిస్టర్ అండ్ మిసెస్ మహి షూటింగ్ దశలో ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























