తమిళ్ స్టార్ హీరో ధనుష్ విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక అదే రకంగా విజయాలను కూడా అందుకుంటున్నాడు. రీసెంట్ గా ధనుష్ హీరోగా వచ్చిన సినిమా తిరుచిత్రంబలం. తెలుగులో ఈసినిమా తిరు అనే టైటిల్ తో రిలీజ్ అయింది. ఆగష్ట్ 18వ తేదీన రిలీజ్ అయింది ఈసినిమా. మంచి ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈసినిమాకు మంచి ఆదరణ లభించింది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ అందించింది. ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా రూ. 100 కోట్ల క్లబ్లోకి కూడా చేరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ లో నేటి నుండి ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్ తో పాటు తెలుగు లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేటర్లలో సినిమాను చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.
కాగా మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో నిత్యామీనన్, రాశీఖన్నా, ప్రియా భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటించారు. భారతీరాజా, ప్రకాష్రాజ్, రేవతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























