లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాలు అంటే ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయన్న సంగతి తెలిసిందే. ఎన్నో క్లాసిక్ సినిమాలు అందించారు ఆయన. అయితే ఈ మధ్య కాలంలో కొత్త కొత్త డైరెక్టర్లు రావడంతో ఈయన కాస్త వెనుకబడిపోయారు. ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ తో.. భారీ తారాగణంతో మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కూడా మొదలుపెట్టి ఎప్పుడో అవుతుంది. మొదట ఒక పార్ట్ మాత్రమే అనుకున్నా ఆ తర్వాత ఈసినిమాను కూడా రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి అప్పుడప్పుడు పోస్టర్లు రిలీజ్ చేస్తూ వస్తూనే ఉన్నారు. ఈసినిమాలో నటిస్తున్న ఒక్కో క్యారెక్టర్ని పరిచయం చేస్తూ పోస్టర్స్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ అప్ డేట్ ను త్వరలో ఇవ్వనున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు.
ప్రముఖ నటీనటులు విక్రమ్, ‘జయం’ రవి, కార్తి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, లాల్, జయరామ్, ప్రకాశ్ రాజ్, రియాజ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ కాగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చుతున్నారు. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్తో మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై మణిరత్నం, సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: