సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తమ హీరో సినిమా కోసం ఎప్పటినుండో ఆసక్తికరంగా చూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు తరువాత ఈయన నుంచి మరో సినిమా రాలేదు. దీంతో వెండి తెరపై మహేష్బాబు కనిపించి రెండేళ్ళు దాటింది. అందుకే అభిమానులు మహేష్ నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి మ్యూజికల్ ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇప్పటికే రిలీజ్ అయిన మొదటి పాట కళావతి ఓ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు రెండో సింగిల్ కు టైమ్ వచ్చేసింది. అందుకు డేట్ కూడా ఫిక్స్ చేసేశారు మేకర్స్. మార్చి 20న ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిలో భాగంగా తాజాగా ఈ పాట ప్రోమోను విడుదల చేసింది చిత్ర బృందం. ఎవ్రీ ఎవ్రీ పెన్ని అంటూ సాగే ఈపాట కూడా హుషారుగానే సాగుతున్నట్టు కనిపిస్తుంది. సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఈపాటలో మహేష్ తనయ సితార కనిపించడం. మహేష్ లేడి గ్రూప్తో డ్యాన్స్ చేస్తుంటే.. సితార మరో గ్రూప్తో లీడ్ డ్యాన్స్ర్గా ఆకట్టుకుంటుంది. ఇక వీరిద్దరిని ఒకే పాటలో చూడటంతో ఫ్యాన్స్ మాత్రం సంబరపడిపోతున్నారు.
Here is Our #PennyPromo
And here We Welcome Our Dearest Darling #princess #Sithara ♥️❤️
Our Love to Our Very Own dear #SuperStar @urstrulyMahesh Gaaru #SuperStarShining
Get ur Earphones Now 🔥💣#PennySong from Tomorrow
💣💣💣💣💣💣💣💣💣https://t.co/eR4gN4kWqq
— thaman S (@MusicThaman) March 19, 2022
కాగా పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈసినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మే12న ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: