ఈమధ్య ఓటీటీలకు కూడా డిమాండ్ బాగానే పెరిగిందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఓటీటీల ద్వారా సినిమాలు కానీ వెబ్ సిరీస్ లను కానీ చూసేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అందుకే గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా వెబ్ సిరీస్ లు తీస్తున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా వెబ్ సిరీస్ లలో నటించడానికి ఏమాత్రం వెనుకాడటంలేదు. ఇక తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా ఈ జాబితాలో చేరారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఏటీఎమ్ అనే వెబ్ సిరీస్ రానుంది. హరీష్ శంకర్ కథను అందిస్తుండగా దిల్ రాజు ఈ సిరీస్ ను నిర్మించనున్నారు. సి. చంద్ర మోహన్ స్క్రీన్ ప్లే తో పాటు దర్శకత్వం కూడా వహించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ శంకర్ ను.. ఓటీటీ ల డామినేషన్ ఎక్కువగా ఉందని వెబ్ సిరీస్ చేస్తున్నారా.. లేకపోతే ఛేంజ్ కోసం ఈ కథను రాశారా అని అడుగగా దానికి హరీష్ శంకర్ సమాధానం చెబుతూ.. రీసెంట్ గా వచ్చిన అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ సినిమాలు ఎంత బ్లాక్ బస్టర్ అయ్యాయో చూశాం.. నా చిన్నప్పుడు కేబుల్ టీవీలు వచ్చినప్పుడు థియేటర్స్ పని అయిపోయింది.. అందరూ ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూస్తారు అని అన్నారు ఏం జరిగింది.. ఆ తరువాత థియేటర్లు ఎలా పెరిగాయో చూశాం.. ఇక ఇప్పుడు కూడా ఓటీటీ అనేది మరో ఎంటర్ టైన్ మెంట్ వేదిక మాత్రమే కానీ థియేటర్లకు ఆల్టర్ నేట్ కాదు.. ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫొటో ఉందని తిరుపతి వెళ్లకుండా ఉంటామా.. అలానే థియేటర్లు మాకు దేవాలయంతో సమానం.. తప్పకుండా జనాలు థియేటర్లకు వస్తారని నమ్ముతున్నాం.. అలానే వస్తున్నారు కూడా అంటూ స్పష్టం చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: