ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ తన నట విశ్వరూపం , డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో 300 కోట్ల క్లబ్ లో చేరింది. “పుష్ప: ది రైజ్” మూవీలో రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.
హీరో బాలకృష్ణ “అఖండ “, హీరో అల్లు అర్జున్ “పుష్ప: ది రైజ్” మూవీస్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. “అఖండ ” మూవీ టాలీవుడ్ లో 80+క్రోర్స్ షేర్ కలెక్ట్ చేసి దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ సర్ ప్రైజ్ చేస్తుండగా , “పుష్ప: ది రైజ్” మూవీ బాలీవుడ్ లో సుమారు 57 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతూ షాక్ కు గురిచేస్తుంది. ఈ రెండు మూవీస్ దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: