సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” (2016)కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్న బ్లాక్ బస్టర్ “ఛలో “(2018 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.” గీత గోవిందం ” , “సరిలేరు నీకెవ్వరు”, “భీష్మ “, “పుష్ప :ది రైజ్ ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “సుల్తాన్ ” మూవీ తో కోలీవుడ్ కు రష్మిక పరిచయం అయ్యారు. శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. రష్మిక ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” , బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ స్ లో కథానాయికగా నటిస్తున్నారు.అల్లు అర్జున్ , రష్మిక జంటగా తెరకెక్కిన “పుష్ప :ది రైజ్ ” మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. “పుష్ప :ది రైజ్ ” మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక నూతన సంవత్సరాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేశారు. న్యూఇయర్ వేళ పూల్ సైడ్ రిలాక్స్ డ్ గా ఉన్న తన ఫొటోను రష్మిక ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: