మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇన్ని రోజులు ఈసినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఆ డేట్ రానే వచ్చేసింది. ముందునుండి అనుకుంటున్నట్టే నేడు ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈకార్యక్రమానికి చిత్రయూనిట్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి అలాగే బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కూడా పాల్గొన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు ఆర్సీ 15 టీమ్. మేము సిద్ధంగా ఉన్నాం.. వచేస్తున్నాం అంటూ ఓ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్లో సినిమా టీమ్ అంతా బ్లాక్ సూట్లు వేసుకొని చేతిలో ఫైల్స్ , బ్యాగ్లతో కనిపిస్తున్నారు. ఇంకా ఈ పోస్టర్లో సినిమాలో నటించే హీరో హీరోయిన్లు, అలాగే డైరెక్టర్, ప్రొడ్యూసర్ తో పాటు ఇతర నటీనటులు కూడా ఉన్నారు. పోస్టర్ లో హీరోయిన్ అంజలి, సునీల్, జై రామ్ కనిపిస్తుండగా.. వీరు ఈసినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారని అర్థం అవుతుంది.
We are coming !!!#RC15 #SVC50 Muhurtham Ceremony Today. @shankarshanmugh @AlwaysRamCharan@advani_kiara @MusicThaman @DOP_Tirru @ramjowrites @saimadhav_burra @SVC_official pic.twitter.com/VnwUtmPaXP
— Sri Venkateswara Creations (@SVC_official) September 8, 2021
కాగా ఈసినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































