మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. సుబ్బరాజు , వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని 24 గంటల్లో 25.7 మిలియన్ వ్యూస్, 7లక్షల 54వేల లైక్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సర్కారు వారి పాట ” మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ ను దుబాయ్ లో కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. 2 వారాల పాటు జరిగిన గోవా షెడ్యూల్ లో షూటింగ్ తో పాటు మహేష్ బాబు ఫ్యామిలీ తో ఎంజాయ్ చేశారు. గోవాలో రామ్ లక్ష్మణ్ మాస్టర్ల ఆధ్వర్యంలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్లు కంపోజ్ చేశారనీ , అవి సినిమాకు హైలెట్ అవుతాయనీ సమాచారం. గోవా షెడ్యూల్ సక్సెస్ ఫుల్గానే కంప్లీట్ చేసుకుని మహేష్ బాబు స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ స్పెషల్ ఫ్లైట్లో మహేష్ బాబు, మంజుల ఘట్టమనేని,నమ్రత , వంశీ పైడిపల్లి, ఆయన సతీమణి ఉన్నారు. గోవా టు హైద్రాబాద్, అక్కడున్న ప్రతీక్షణం ఎంజాయ్ చేశాననీ , మళ్లీ కలిసే వరకు బై అంటూ ఒక ఫోటోను నమ్రత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: