టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట ” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. సుబ్బరాజు , వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక షూటింగ్ షెడ్యూల్ ను దుబాయ్ లో కంప్లీట్ చేసుకున్న “సర్కారు వారి పాట ” మూవీ రెండవ షెడ్యూల్ ప్రారంభించగానే కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్కి బ్రేక్ పడింది.జూలై నెలలో “సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ నోటీస్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మహేష్ బాబు స్టైలిష్ న్యూ లుక్ లో ఉన్న ఆ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుని 24 గంటలలో 95.6 K లైక్స్ , 49.1 రీ ట్వీట్స్ తో టాలీవుడ్ లో న్యూ రికార్డ్ ను క్రియేట్ చేసింది. బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు “మూవీ తరువాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































