మెగా స్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభించి ప్రజలకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. కరోనా ఫస్ట్ వేవ్ లో సినీ కార్మికులకు కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో నిత్యావసర వస్తువులు అందజేశారు. కరోనా సెకండ్ వేవ్ లో కరోనా బాధితులకు సకాలం లో ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడాలనే లక్ష్యం తో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో జిల్లా కు ఒక ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా కష్టకాలంలో కరోనా వ్యాప్తి నివారణకై సినీ కార్మికులకు తన ట్రస్ట్ ద్వారా వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించారు. ఇక తాజాగా మెగా స్టార్ చిరంజీవి మరో మహోత్తర కార్యక్రమంకు శ్రీకారం చుట్టబోతున్నారనీ , వీలైనంత త్వరగా తెలుగు రాష్ట్రాలలో అంబులెన్స్ సర్వీస్ లను ప్రారంభించాలని చిరంజీవి ప్లాన్ చేసినట్టు సమాచారం . ఇలా తమ అభిమాన హీరో చిరంజీవి పలు సేవా కార్యక్రమాలు చేపట్టడంతో అభిమానులు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న “ఆచార్య ” మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తో పాటు చిరంజీవి పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: