బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటిగా ఎంత పేరుతెచ్చుకుందో నిరంతరం వివాదాలతో కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కంగనా. ఇన్ని రోజులు హీరోయిన్ గా అలరించిన కంగనా ఇప్పుడు నిర్మాతగా కూడా మారనుంది. కంగనా మణికర్ణిక ఫిలిమ్స్ పేరుతో బ్యానర్ స్థాపించింది. ఆమెకు జాతియ అవార్డు తెచ్చిపెట్టిన ‘మణికర్ణిక’ చిత్రంపేరునే కంగనా తన బ్యానర్ కు పెట్టడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే కంగనా మెయిన్ స్ట్రీమ్ సినిమా కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్ లో సినిమాలు చేసేందుకు రెడీ అయింది. నూతన నటీనటులతో క్యూట్ లవ్ స్టోరీగా ‘టికు వెడ్స్ షేరు’ పేరుతో సినిమా తీయబోతున్నట్టు ట్వీటర్ వేదికగా కంగనా వెల్లడించింది. అలాగే తన ప్రొడక్షన్ హౌస్ లోగోను ఆమె ఆవిష్కరించింది. ఈసందర్భంగా మా ప్రొడక్షన్ సంస్థ నుంచి కొత్త టాలెంట్ని, కొత్త కాన్సెప్ట్లని పరిచయం చేస్తాము. సాధారణ సినిమాలు చూసే ప్రేక్షకుల కంటే.. డిజిటల్ సినిమాలు చూసే ప్రేక్షకులు కాస్త పరిణితి చెందిన వాళ్లు అని మా భావన’’ అని కంగనా తెలిపింది.
Launching the logo of @ManikarnikaFP with the announcement of our debut in digital space with a quirky love story Tiku weds Sheru …. Need your blessings 🙏 pic.twitter.com/ulaMK62m7l
— Kangana Ranaut (@KanganaTeam) May 1, 2021
ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగతనటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కంగనాతో పాటు అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్తో కలిసి విబ్రీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: