టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివిశేష్ హీరోగా, శోభిత ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన సినిమా ‘మేజర్’. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. నిన్ననే శోభితా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా టీజర్ ను ఏప్రిల్ 12న రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా టైమ్ ను ఫిక్స్ చేశారు. ఈమేరకు అడివి శేష్ తన ట్విట్టర్ లో టీజర్ ఏప్రిల్ 12న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నామని ఖచ్చితంగా ఈటీజర్ మాసివ్ గా ఉండబోతుందని ప్రామిస్ కూడా చేశాడు.
MAJOR. TEASER.
APRIL 12
4:05 PM
It’ll be MASSIVE. I PROMISE.
GET READY.#MajorTeaser#MajorTeaserOnApril12#MajorTheFilm pic.twitter.com/ptjqOWumaP
— Adivi Sesh (@AdiviSesh) April 10, 2021
మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్ సినిమాలతో అలరించిన అడివి శేష్ కు ఈ సినిమా ఎంత సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: