విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన `దృశ్యం` సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఏ భాషలో రీమేక్ చేసినా కూడా అన్ని చోట్లా ఈ సినిమా విజయమే దక్కించుకుంది. ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ దృశ్యం2 కూడా వస్తుంది. విక్టరి వెంకటేష్, మీనా జంటగా జీతు జోసెఫ్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈసినిమాను ప్రారంభించగా ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసీక్వెల్ లో రానా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ లో కేసు క్లోజ్ అయిపోతుంది సెకండ్ పార్ట్ లో కొత్త ఇన్స్పెక్టర్ చార్జ్ తీసుకున్నాక కేసుని రీ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మలయాళంలో మురళీ గోపీ చేసిన కొత్త ఇన్స్పెక్టర్ పాత్రను తెలుగులో రానా చేయనున్నారని టాక్. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, ఆశిర్వాద్ సినిమాస్, రాజ్కుమార్ థియేటర్ ప్రై.లి పతాకాలపై డి. సురేష్బాబు, ఆంటోని పెరుంబవూర్, రాజ్కుమార్ సేతుపతి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా సతీష్ కురూప్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: