బాహుబలి సినిమా అంటే మొదట మనకు గుర్తొచ్చేది బాహుబలి ప్రభాస్-భళ్లాలదేవ రానా. వారిద్దరూ లేకపోతే ఆ సిరీస్ లేనట్టే అని చెప్పొచు. ఇక ఈ సినిమాతో అటు ప్రభాస్, రానా కెరీర్ రేంజ్ ఏ కాదు.. తెలుగు సినిమా రేంజ్ కూడా పెరిగిపోయింది. ఇక ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని కూడా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేస్తున్న 21 సినిమాలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అందులో ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ లేదనుకోండి..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం రానా తన ట్విట్టర్ లో ఇచ్చిన రిప్లై ఏ కారణం. అసలు సంగతేంటంటే.. ఒక అభిమాని లవ్ యూ అన్నా మళ్లీ డార్లింగ్ తో ఎప్పుడు చూడగలమో నిన్ను అని ట్వీట్ చేయగా.. దానికి రానా బాహుబలి2 సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశంలో వచ్చే వారి ఫొటోను పోస్ట్ చేసి ఈ బొమ్మకి మ్యాచ్ అయ్యే కథ దొరికినప్పుడు అని రిప్లై ఇచ్చాడు. మరి అలాంటి కథ ఇంకెప్పుడు వస్తుందో.. వీరిద్దరూ ఎప్పుడు మరోసారి కలిసి నటిస్తారో చూద్దాం.
Ee Bomma ki match ayyaeantha kadha vachinnapudu 😉 pic.twitter.com/OPHU3Q0Oe3
— Rana Daggubati (@RanaDaggubati) February 17, 2021
ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా “హాథీ మేరే సాథీ ” అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘అరణ్య’, తమిళ్లో కదన్ పేరుతో రిలీజ్ కానుంది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇంకా విరాట పర్వం సినిమా కూడా చేస్తున్నాడు. వీటితో పాటు మిలింద్ రౌ దర్శకత్వంలో కూడా సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో యాక్షన్ అడ్వంచర్ గా ఈ మూవీ తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































