కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పలు సాంగ్స్, పోస్టర్స్ లాంటివి ఇప్పటికే రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక టీజర్ అప్డేట్ కోసం కూడా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రేపు సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
#SreekaramTeaser Launch by SUPERSTAR @urstrulyMahesh gaaru tomorrow at 4:05 PM 💥💥#SreekaramOnMarch11th #Sreekaram @ImSharwanand @priyankaamohan @Im_bkishor @saimadhav_burra @MickeyJMeyer @RaamAchanta #GopiAchanta @SonyMusicSouth pic.twitter.com/GRmA3KZsIL
— 14 Reels Plus (@14ReelsPlus) February 8, 2021
కాగా ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























