తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రాశీఖన్నా , ప్రస్తుతం 3 తమిళ మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఒక తమిళ వెబ్ సిరీస్ “అంధాధున్ “మలయాళ రీమేక్ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. ఒక మూవీ లో రాశీఖన్నా , సాయి తేజ్ కు జోడీగా ఎంపిక అయ్యారనీ , ఒక హిందీ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.రాశీఖన్నా తన లేటెస్ట్ ఫొటో షూట్ ఫొటోస్ , వర్కౌట్ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వయా కామ్ 18 మోషన్ పిక్చర్స్ , మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై శ్రీ రామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా , రాధికా ఆప్టే జంటగా , సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటించిన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ హిందీ మూవీ “అంధాధున్” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “అంధాధున్ “మూవీ తెలుగు , తమిళ , మలయాళ భాషలలో రీమేక్ జరుపుకుంటుంది. రవి K చంద్రన్ దర్శకత్వంలో పృథ్విరాజ్ , రాశీఖన్నా జంటగా , మమతా మోహన్ దాస్ కీలక పాత్ర లో రూపొందుతున్న “అంధాధున్ ” మూవీ మలయాళ రీమేక్ ఈ రోజు పూజాకార్యక్రమం జరుపుకుంది. మలయాళ మూవీ జర్నీ ప్రారంభం అయ్యిందనీ , మీ బ్లెస్సింగ్స్ కావాలనీ రాశీఖన్నా ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: