కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది.ఇక ఇన్ని నెలలు కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయింది. నిజానికి ఈ సినిమా షూట్ ను నిన్ననే ప్రారంభించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే ఆశ్చర్యంగా నిన్ననే చిరు తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి షాకిచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే లేట్ అవ్వడంతో షూటింగ్ మొత్తాన్ని ఆపకుండా ముందుగా చిరు లేని పోర్షన్స్ ను కంప్లీట్ చేసి ఆ తర్వాత చిరు కోలుకున్నాక మిగిలిన పోర్షన్ ను షూట్ చేయనున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తను గౌతమ్ కిచ్లూ తో హనీమూన్ లో ఉంది. వెనక్కి వచ్చిన తర్వాత ఆచార్య షూటింగ్ లో పాల్గొననుంది
కాగా ఈ సినిమాలో రామ్చరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























