‘లెజెండ్’ సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్న సంగతి తెలిసిందే. రెండు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య కనిపించనున్నాడట. రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్రలో రెండు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య కనిపించనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ పై ఇప్పటికే పలువురు పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ఎవరినీ అధికారికంగా ప్రకటించలేదు. తర్వాత ఆ విషయమే మరిచిపోయారు అందరూ. ఇక ఇప్పుడు ఆ అనౌన్స్మెంట్ వచ్చింది. బాలయ్య సినిమాలో అఖిల్ ఫేమ్ సయేషా సైగల్ నటించబోతుంది. ఈ మేరకు చిత్రయూనిట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. చూద్దాం మరి వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో.
Welcoming beautiful & talented actress @sayyeshaa on board for #BB3. Looking forward to seeing you soon on sets.#BalayyaBoyapati3#NandamuriBalakrishna #BoyapatiSrinu @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation pic.twitter.com/1MDW82uRop
— Dwaraka Creations (@dwarakacreation) November 10, 2020
ఇదిలా ఉండగా అఖిల్ సినిమా తర్వాత తెలుగులో సయేషా మళ్లీ కనిపించలేదు. ఇక్కడ అవకాశాలు కూడా రాలేదు. తమిళ్ లో మాత్రం బాగానే సినిమాలు చేసింది. చాలా తక్కువ సమయంలోనే చాలా మంది హీరోలందరితోనూ నటించింది. ఈ క్రమంలోనే భలేభలే మగాడివోయ్ రీమేక్ గజినీకాంత్లో తనతో పాటు నటించిన ఆర్యను పెళ్లి చేసుకుంది సయేషా. పెళ్ళి తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: