సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. అందరూ షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టాలని చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి తన ట్విట్టర్ ద్వారా ఒక అప్ డేట్ ఇచ్చాడు. సర్కారు వారి పాట`కు సంబంధించి తాజాగా అద్భుతమైన మ్యూజిక్ కంపోజింగ్స్ జరిగాయి. మహేష్ గారికి మంచి పాటలు అందించేందుకు వీలుగా అద్భుతమైన సన్నివేశాలను సృష్టించిన డార్లింగ్ డైరెక్టర్ పరశురామ్కు ధన్యవాదాలు. నిర్మాతలకు కృతజ్ఞతల`ని థమన్ ట్వీట్ చేశాడు.
We have recently had a lovely Compositions time for #SarkaruVaariPaata thanks to darling @ParasuramPetla for making lovely situations to compose for our #superstar @urstrulyMahesh gaaru 🤍.
Thanks to team @MythriOfficial @GMBents @14ReelsPlus for the love & care ♥️Godbless 💿 pic.twitter.com/u6pS2r6PQf
— thaman S (@MusicThaman) October 29, 2020
కాగా ‘అల వైకుంఠపురములో’ లాంటి ఆడియో ఆల్బమ్ తో ఈ ఏడాదిని స్టార్ట్ చేసాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. వరుస సూపర్ హిట్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్న థమన్ ను ‘అల వైకుంఠపురములో’ సినిమా మరో మెట్టు ఎక్కించింది. ఈ పాటలు యూ ట్యూబ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో.. ఎన్ని రికార్డ్స్ సాధించాయో చూసాం. ఇక ప్రస్తుతం థమన్ ఒకటి కాదు రెండు కాదు చాలా సినిమాలతో సూపర్ బిజీ గా వున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: