అశోక్ తేజ దర్శకుడిగా.. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఓదెల రైల్వేస్టేషన్’. ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఈ సినిమా రూపొందనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మొదటి షెడ్యూల్ పూర్తిచేసింది చిత్ర యూనిట్.మొదటి షెడ్యూల్లో కొన్ని సీన్లను ఓదెల ర్వైల్వేస్టేషన్లో చిత్రీకరించగా మరికొన్ని సన్నివేశాలను ఓదెల మండలంలో తెరకెక్కించారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారట. ఇప్పటికే హైదరాబాద్లో డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా షూటింగ్ కి కొంత గ్యాప్ రాగా ఈరోజు నుండి రెండో షెడ్యూల్ షూటింగ్ను స్టార్ట్ చేశారు.
కాగా కన్నడలో 25 చిత్రాలకు పైగా నటించిన వశిష్ట సింహ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్యమైన పాత్రలో హీరోయిన్ హెభా పటేల్ నటిస్తుంది. ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఈ సినిమా రూపొందనుంది. మరి టైటిలే డిఫరెంట్ గా వుంది.. సినిమా ఇంకెలా ఉంటుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: