రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ రోజురోజుకు వేగంగా వ్యాపిస్తుంది. మొదట ఆయన మొక్కలు నాటి ఛాలెంజ్ విసరడంతో అది రోజురోజుకు దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ ఛాలెంజ్ ను స్వీకరించి గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేశారు. ఇప్పుడు తాజాగా ఈ ఛాలెంజ్ ను సుధీర్ బాబు స్వీకరించాడు. హీరో నవీన్ కృష్ణ సుధీర్ బాబుకు ఛాలెంజ్ విసరగా ఛాలెంజ్ను స్వీకరించిన సుధీర్ బాబు ఈ రోజు తన నివాసంలో మొక్కలు నాటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. `రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అందరిలోనూ స్ఫూర్తి నింపుతోంది. ఈ చాలెంజ్ స్వీకరించి తాజాగా విడుదలైన ‘వి’ సినిమాకు గుర్తుగా మొక్కలు నాటాను. ఇకపై నా ప్రతి సినిమా విడుదలకు ముందు మొక్కను నాటి.. దానికి ఆ సినిమా పేరు పెడతాను. మా పిల్లలకు కూడా ఇదే నేర్పుతాను. ఇప్పటి పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు, ఉద్యోగం సాధించినప్పుడు మొక్కలు నాటే అలవాటు చేసుకోవాలి. రోజురోజుకూ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ గారికి మా ‘వి’ సినిమా చిత్ర బృందం తరఫున కృతజ్ఞతలు. ఇక, ఈ ఛాలెంజ్కు మా సినిమా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, హీరోయిన్లు నివేదా థామస్, అదితీరావులను నామినేట్ చేస్తున్నానని తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: