అప్పుడప్పుడు కొన్ని సినిమాలపై పలు ఆరోపణలు వస్తూనే ఉంటాయి. పలానా కథలు మావి అంటూ.. పలు పాటలు మావి అంటూ ఆరోపణలు చేస్తుంటారు. ఇక ఇప్పుడు తాజాగా ఆచార్య సినిమాకు కూడా ఆరోపణలువస్తున్నాయి. రాజేష్ అనే వ్యక్తి ఆచార్య కథ తనదంటూ ఆరోపణలు చేయడంతో ఆచార్య టీం దీనిపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ఆచార్య’ సినిమా ఒరిజినల్ కథ, కాన్సెప్ట్ దర్శకుడు కొరటాల శివదే.. ఈ కథపై వస్తున్న కాపీ ఆరోపణలన్నీ నిరాధారమైనవి. ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆచార్య సినిమా టైటిల్ లుక్ పోస్టర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ పోస్టర్కు అన్నీ వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకు వచ్చిన హైప్ చూసి కొందరు రైటర్స్ ‘ఆచార్య’ సినిమా కథ తమదంటూ తప్పుడు ఆరోపణలు చేశారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతుండటం వల్ల సినిమా కథను రహస్యంగానే ఉంచాం. చాలా తక్కువ మందికి మాత్రమే సినిమా కథ గురించి తెలుసు.. కేవలం మోషన్ పోస్టర్ను చూసి ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం. ఫైనల్ గా చెప్పేది ‘ఆచార్య’ కథ ఒరిజినల్. కొరటాల శివలాంటి పేరున్న దర్శకులపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు. మీడియాల్లో ‘ఆచార్య’ సినిమా గురించి వస్తోన్న రూమర్ స్టోరీలను ఆధారంగా చేసుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఈ కథపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవి, తప్పుడు కథనాలు. ఎవరికి వారు ఉహించుకున్నవి. ఈ కథ కోసం మెగాస్టార్తో కొరటాల శివ రెండేళ్ల పాటు ట్రావెల్ అయ్యారు. ఆయన ఇమేజ్కు తగినట్లు పర్ఫెక్ట్ ఎంటర్టైనర్గా ‘ఆచార్య’ సినిమా కథను సిద్ధం చేశారని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా40 శాతం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. కరోనా వచ్చి పడటంతో షూటింగ్ కు కూడా బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: