హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం మూవీ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. రామ్ చరణ్ నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా స్టార్ చిరంజీవి హీరోగా “ఖైదీ నెం 150 “, “సైరా నరసింహా రెడ్డి ” మూవీస్ ను నిర్మించారు. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా “ఆచార్య ” మూవీ ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రతీ నటుడికీ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుందన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరో , నిర్మాత గా కొనసాగుతున్న రామ్ చరణ్ తనకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందని వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ మాట్లాడుతూ .. స్పోర్ట్స్ నేపథ్యం రూపొందే స్పోర్ట్స్ డ్రామా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అనీ , ఇంతకు ముందు ఒక స్పోర్ట్స్ డ్రామా “మెరుపు ” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ మూవీ సెట్స్ పైకి వెళ్ళలేదనీ , స్పోర్ట్స్ నేపథ్య మూవీ కై చాలా కాలంగా ఎదురుచూస్తున్నాననీ , అటువంటి స్క్రిప్ట్ లభించినప్పుడు తన కోరిక నెరవేర్చుకుంటాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: