సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే ప్రస్తుతంప్రభాస్ హీరోగా రూపొందుతున్న “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీస్ లో నటిస్తున్నారు. రెండు బాలీవుడ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయిక గా ఎంపిక అయ్యారు. లాక్ డౌన్ సమయం లో పూజాహెగ్డే సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యతను ఇచ్చే పూజాహెగ్డే యోగా పై పూర్తి ఫోకస్ పెట్టారు. ముంబై లోని తన ఇంటిలో యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. యోగా లోని పలు ఆసనాలను పూజాహెగ్డే ట్రై చేస్తున్నారు. వీరభద్రాసనం వేసిన పూజాహెగ్డే ఇప్పుడు ధనురాసనం వేశారు. యోగా చేసిన తరువాత సంతోషకర అలసట కలుగుతుందని అంటూ ధనురాసనం ఫొటోను పూజాహెగ్డే ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది. షూటింగ్స్ ప్రారంభాని కై పూజాహెగ్డే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: