మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ , జగపతి బాబు , బాబీ సింహా, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




కరోనా మహమ్మారి కారణం గా లాక్ డౌన్ లో మూవీ షూటింగ్స్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. దాదాపు రెండున్నర నెలల తరువాత లిమిటెడ్ మెంబర్స్ తో షూటింగ్స్ జరుపుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. “పుష్ప” మూవీ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులలో అవుట్ డోర్ షూటింగ్ కష్టం కనుక ముందుగా ఇన్ డోర్ షూటింగ్ కంప్లీట్ చేయాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశారు. ఇప్పటికే సాంగ్స్ రెడీ గా ఉండడంతో సాంగ్స్ చిత్రీకరణ జరపాలని సుకుమార్ నిర్ణయించినట్టు సమాచారం. సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న “పుష్ప ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























