మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో ఓ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ‘చిరు 153’గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే… ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు అతిథి పాత్ర పోషించనున్నాడని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’ చిత్రానికి రీమేక్గా ‘చిరు 153’ రూపొందనుంది. ‘లూసిఫర్’ మలయాళ వెర్షన్లో ఆ చిత్ర దర్శకుడు, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ముఖ్య భూమిక పోషించాడు. మోహన్ లాల్కి నమ్మినబంటుగా ఉండే జాయద్ మసూద్ పాత్రలో పృథ్వీ నటన సినిమాకే ప్రత్యేకాకర్షణగా నిలిచింది. కాగా, ఇప్పుడా పాత్రలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించనున్నాడని ప్రచారం సాగుతోంది. త్వరలోనే సల్మాన్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
ఇదిలా ఉంటే.. చిరు టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ 2021 సంక్రాంతికి లేదంటే అదే ఏడాది వేసవికి విడుదల కానుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: