కరోనా ను అరికట్టేందుకు గానూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఇళ్లల్లో నుండి బయటకు రావొద్దని చెపుతూనే… ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు. ఇంకా వేడి నీళ్లకు చన్నీళ్ళు అన్నట్టు మన టాలీవుడ్ హీరోలు కూడా తమ వంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, నితిన్త, పలువురు డైరెక్టర్స్ విరాళాలు ప్రకటించగా…. ఇప్పుడు వీరి ఖాతాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు. తనవంతుగా మొత్తం రూ.1.25 కోట్ల సాయాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ హీరో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేరళకు కూడా తన సాయాన్ని అందచేశాడు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ‘కోవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. మన రోజువారి జీవితాల్ని మార్చేసింది. ఇలాంటి సమయంలో వైద్యులు, నర్సులు, మిలటరీ, పోలీసులు, ఇలా మన కోసం ఎంతగానో కష్టపడుతున్న వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. వారి స్ఫూర్తితో నా వంతుగా చిన్నపాటి సాయం చేయాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ ప్రభుత్వాలకు రూ. 1.25 కోట్లు విరాళంగా ఇస్తున్నాను. చేతులను తరుచు కడుక్కోవడం, స్వీయ నిర్బంధంలో ఉండటం ద్వారా మనం కరోనా వ్యాప్తిని నివారించవచ్చు. అతి త్వరలోనే కరోనా అంతమవ్వాలని ఆశిస్తున్నాను’ అని తెలిపారు.
కాగా, తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళలో కూడా అల్లు అర్జున్కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో భారీ వరదలు వచ్చినప్పుడు కూడా అల్లు అర్జున్ తనవంతు సాయాన్ని అందించాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: