జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ఆది సాయికుమార్. ప్రస్తుతం శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో ‘శశి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఆడికి జోడీగా ‘సురభి’ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమా నుండి ది సోల్ ఆఫ్ ‘శశి’ పేరుతో ఈ ప్రేమికుల దినోత్సవం రోజున సురభి కి సంబంధించిన ఒక ఉప డేట్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న సినిమాలో సురభి, రాశీ సింగ్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఆర్.పి.వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది సమ్మర్లో సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు ఆది. అందులో జిబి.క్రిష్ణ డైరెక్షన్లో ఒక సినిమా. ఈ చిత్రాన్ని మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు. ఇక మూడవ చిత్రం నూతన దర్శకుడు శివ శంకర్ దేవ్ దర్శకత్వంలో ఉండనుంది. ఈ చిత్రాన్ని మరుధురి ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: