మొదటి నుండి కాస్త డిఫరెంట్ స్టోరీలను తెరకెక్కిస్తుంటాడు డైరక్టర్ తేజ. తాను డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా ‘చిత్రం’ ఆ తర్వాత వరుసగా ‘నువ్వు నేను’, ‘జయం’ ఇలా సూపర్ హిట్లు కొట్టాడు. ఒక్క ‘నువ్వు నేను’ సినిమాకే ఆరు నంది అవార్డులు వచ్చాయంటేనే అర్ధం చేసుకోవచ్చు. ఇక ఫుల్ ఫామ్ లో వున్న తేజ ఆ తరవాత తీసిన సినిమాల వల్ల కాస్త వెనుకపడ్డాడు. అయితే చాలా కాలం తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా హిట్ తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ‘సీత’ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో రెండు ప్రాజెక్ట్స్ ను వెంట వెంటనే లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. రానాతోనే మరో సినిమాను చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి ‘రాక్షస రాజు రావణుడు’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. మరో వైపున గోపీచంద్ హీరోగా మరో సినిమా చేయడానికి కూడా ఆయన రంగం సిద్ధం చేస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాకి ‘అలివేలు వెంకటరమణ’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడట. ఈ రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడట తేజ. మరి చూద్దాం ఇందులో ఎంత నిజముందో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: