నటసింహ నందమూరి బాలకృష్ణకు అచ్చొచ్చిన స్వరకర్తల్లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఒకరు. ముఖ్యంగా… వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తొలి, మలి చిత్రాలు `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` అయితే… అప్పట్లో ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. ఆపై `భలేవాడివి బాసూ!`, `సీమసింహం`, `చెన్నకేశవరెడ్డి`, `పలనాటి బ్రహ్మనాయుడు`, `లక్ష్మీ నరసింహా`, `అల్లరి పిడుగు`, `వీరభద్ర`, `ఒక్క మగాడు`, `మిత్రుడు`, `పరమవీరచక్ర`, `లయన్`… ఇలా మరో పదకొండు సినిమాల కోసం ఈ సెన్సేషనల్ కాంబినేషన్ జట్టుకట్టింది. కట్ చేస్తే… ఐదేళ్ళ గ్యాప్ తరువాత బాలయ్య, మణి కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతుందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `సింహా`, `లెజెండ్` తరువాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందిస్తాడని ఆ మధ్య ప్రచారం సాగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం… ఆ అవకాశం మణిశర్మకు దక్కిందని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.
డిసెంబర్ 6న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… జనవరిలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది. వేసవి చివరలో థియేటర్లలో సందడి చేస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























