‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ను ఈ ఏడాది డిసెంబర్ 20న ప్రారంభించి… 2020 మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే… యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే… పలు హిందీ సినిమాల్లో హీరోగా మెప్పించి, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్… బాలయ్య, బోయపాటి సినిమాలో విలన్గా దర్శనమివ్వనున్నాడని టాక్. ఈ నేపథ్యంలో… బోయపాటి, సంజు మధ్య చర్చలు కూడా జరిగాయని వినికిడి. గతంలో నాగార్జున ‘చంద్రలేఖ’(1998)లో అతిథిగా తళుక్కున మెరిసిన సంజు… రెండు దశాబ్దాల తరువాత తెలుగునాట ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించనుండడం విశేషమనే చెప్పాలి. త్వరలోనే సంజయ్ దత్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సంజయ్… ‘తోర్బాజ్’, ‘పానిపట్’, ‘సడక్ 2’, ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’, ‘కె.జి.ఎఫ్.2’(కన్నడ) వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: