యాంకర్ గా బుల్లి తెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్.. దర్శకుడిగా తెరకెక్కించిన హారర్ కామెడీ ‘రాజుగారి గది’. 2015 లో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓంకార్ తమ్ముడు అశ్విన్ ప్రధాన పాత్రలో ధనరాజ్, షకలక శంకర్, ధన్య కృష్ణ, విద్యుల్లేఖ, పూర్ణ, సప్తగిరి, పోసాని కృష్ణ మురళీ తదితరులు నటించిన ఈ సినిమా మంచి హిట్ అయింది. ఇక ఈ సినిమా హిట్ తో ఓంకార్ సీక్వెల్ ను ‘రాజు గారి గది 2’ పేరుతో తెరకెక్కించిన సంగతి కూడా విదితమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజు గారి గది 2 సినిమాలో నాగార్జున, సమంతలు కీలక పాత్రలో నటించగా.. అశ్విన్, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, షకలక శంకర్ కూడా నటించారు. అయితే మొదటి పార్ట్ హాట్ అయినంతగా రెండో పార్ట్ హిట్ అవ్వలేదు. నాగార్జున, సమంతాలను పెట్టినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఇక ఈ సీక్వెల్ లో భాగంగా మూడో పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. అశ్విన్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 18వ తేదీన విడుదలకానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న అశ్విన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ప్రేక్షకులు కోరుకోవడంతో సీక్వెల్ రూపొందించాం. మూడో పార్ట్ వరకూ వచ్చింది. వాళ్లకు నచ్చితే ‘రాజుగారి గది 10’ కూడా ఉండొచ్చు. సెకండ్ పార్ట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందన్నారు. అందుకే థర్డ్ పార్ట్లో ఫుల్ ఎంటర్టైన్మైంట్ గ్యారెంటీ. ఓ మలయాళ సినిమా నుంచి తీసుకున్న పాయింట్ ఆధారంగా ఈ సినిమా చేశామని చెప్పుకొచ్చారు. మరి సీక్వెల్స్ మనకు కలిసొచ్చిన దాఖలాలు లేవు. దానికి ‘రాజు గారి గది 2’ సీక్వెలే బెస్ట్ ఉదాహరణగా చెప్పొచ్చు. 10 పార్ట్స్ ఏమో కానీ ప్రస్తుతానికి పార్ట్ 3 ఎలా ఉంటుందో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: