సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్ ఆర్మీ మేజర్గా దర్శనమివ్వనున్న ఈ యాక్షన్ అండ్ హిలేరియస్ ఎంటర్టైనర్ కోసం… మరోసారి తన సెంటిమెంట్ను పునరావృతం చేయనున్నాడు దర్శకుడు అనిల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… తన తొలి చిత్రం ‘పటాస్’లో హీరోయిన్గా నటించిన శ్రుతి సోదిని… రెండో సినిమా ‘సుప్రీమ్’లో స్పెషల్ సాంగ్ కోసం సెలెక్ట్ చేసాడు అనిల్. అలాగే… ‘సుప్రీమ్’లో కథానాయికగా నటించిన రాశి ఖన్నాను… మూడో చిత్రం ‘రాజా ది గ్రేట్’ కోసం అతిథి పాత్రలో నటింపజేశాడు. ఇక ‘రాజా ది గ్రేట్’లో నాయికగా మెప్పించిన మెహరీన్ను… నాలుగో చిత్రం ‘ఎఫ్ 2’లో మరోసారి హీరోయిన్గానే (తమన్నా మరో హీరోయిన్) రిపీట్ చేసాడు. ఇలా… తన గత చిత్రాల హీరోయిన్స్ను నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం ఏదో రూపంలో పునరావృతం చేస్తూ… దాన్ని ఓ సెంటిమెంట్గా మార్చుకుని మరీ వరుస విజయాలను అందుకుంటున్నాడు అనిల్.
ఈ నేపథ్యంలోనే… తన గత చిత్రం ‘ఎఫ్ 2’లో ఓ నాయికగా నటించిన తమన్నాను… ఇప్పుడు ఐదో సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్ కోసం రిపీట్ చేస్తున్నాడు అనిల్. మరి… గత చిత్రాల సెంటిమెంట్ ఇప్పుడు ‘సరిలేరు…’ కి కూడా కలిసొచ్చి అనిల్ కి మరో ఘన విజయం వరిస్తుందేమో చూడాలి.
కాగా… రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’… 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: