`క్షణం`, `అమీతుమీ`, `గూఢచారి` చిత్రాలతో కథానాయకుడిగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న అడివి శేష్… ఈ పంద్రాగస్టున `ఎవరు`తో పలకరించనున్న సంగతి తెలిసిందే. `క్షణం` చిత్రాన్ని నిర్మించిన పీవీపీ సినిమా ఈ మర్డర్ మిస్టరీ మూవీని నిర్మించగా… వెంకట్ రామ్ జీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టాలెంటెడ్ బ్యూటీ రెజీనా నాయికగా నటించింది. కాగా… తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ కమిటీ ఈ చిత్రానికి `యుఎ` సర్టిఫికేట్ జారీ చేసింది. శ్రీచరణ్ పాకాల సంగీతమందించిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మరి… వరుస విజయాలతో ముందుకు సాగుతున్న అడివి శేష్… `ఎవరు`తోనూ ఆ పరంపరని కొనసాగిస్తాడేమో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=LoEcmE-6-_s]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: