70 ఏళ్ళ బామ్మ… 20 ప్లస్ పడుచు భామగా మారే కథతో తెరకెక్కిన సోషియో-ఫాంటసీ ఫిల్మ్ `ఓ బేబీ`. కొరియన్ మూవీ `మిస్ గ్రానీ` ఆధారంగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో సమంత, లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించగా… నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. జూలై 5న విడుదలై తెలుగు రాష్ట్రాల్లో ఘనవిజయం సాధించిన ఈ సినిమా… ఓవర్సీస్లోనూ మిలియన్ డాలర్ క్లబ్లో చేరింది. కాగా… ఇప్పుడీ చిత్రాన్ని `ఓ బేబీ` పేరుతోనే తమిళంలోనూ విడుదల చేయనున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా అనువాద రూపంలో అక్కడ సందడి చేయనుంది. మరి… తెలుగునాట వసూళ్ళ వర్షం కురిపించిన ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్… సామ్కున్న క్రేజ్తో తమిళనాట కూడా విజయకేతనం ఎగురవేస్తుందేమో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=sWd2g9JEv0Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: