క్షణం, అమీ తుమీ, గూఢచారి సినిమాల హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న శేష్ ఇప్పుడు ఎవరు అనే మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను మాత్రం చాలా సీక్రెట్ గా పూర్తి చేసిన శేష్ సినిమా రిలీజ్ ను కూడా ఫాస్ట్ గానే చేసేస్తున్నాడు. ఆగష్ట్ 15వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో శేష్ సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నవీన్ చంద్ర, మురళి శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా పీవీపీ బ్యానర్ పై పెర్ల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కావిన్ అన్నె ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కాగా వీటితో పాటు అడివి శేష్ చేతిలో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో గత ఏడాది తనకు మంచి సక్సెస్ ఇచ్చిన గూడచారి సీక్వెల్ కాగా తో మరొకటి మహేష్ బాబు, సోనీ సంస్థల సంయుక్తంగా నిర్మించనున్న మేజర్.
[youtube_video videoid=EmaVLDlzu5M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: