స్వరూప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్నఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా భారీ అంచనాలే నెలకొన్నాయి. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొన్న ఈసినిమా ఈనెల 21 (జూన్ 21) వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. రైపు సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ నితీష్ తివారి చేతుల మీదుగా రేపు సాయంత్రం 7 గంటలకు ఈ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. అమీర్ ఖాన్ హీరో గా నితీష్ తివారి తీసిన స్పోర్ట్స్ బయో పిక్ “దంగల్”,ఇండియన్ మూవీ రికార్డ్స్ ని బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. అలాంటి డైరెక్టర్ ఈ చిన్న సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడం గ్రేట్…
కాగా నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ‘మళ్ళీరావా’ చిత్రాన్ని నిర్మించిన రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. మార్క్ కె.రాబిన్ సంగీతం అందించగా.. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫి అందించారు. ఈ సినిమాలో నవీన్ డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. మరి చూద్దాం ఈసినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..! [subscribe]
[youtube_video videoid=eL3aCEAYKSs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: