ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తొలి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్
. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్… తాజాగా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా నాలుగు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. వీటిలో రెండు పాటలను త్వరలోనే విదేశాల్లో చిత్రీకరించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమా టీజర్ను రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పూరీ జగన్నాథ్ స్టైల్లోనే ఈ టీజర్ ఉండబోతోందని వినికిడి. “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాకి… ఛార్మి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. జూన్ ద్వితీయార్ధంలో లేదా జూలైలో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: