వెంకీమామ… విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్. ఇందులో రైస్ మిల్లు ఓనర్ పాత్రలో వెంకీ నటిస్తుండగా… ఆర్మీ ఆఫీసర్గా చైతూ కనిపించనున్నాడని సమాచారం. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా పాయల్ రాజ్పుత్, చైతూకి జంటగా రాశీ ఖన్నా నటిస్తున్నారు. డి. సురేష్ బాబు, టి.జి. విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్… ఇప్పటికే తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న సెకండ్ షెడ్యూల్లో… ముఖ్య తారాగణంపై సరదాగా సాగిపోయే కుటుంబ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే నెక్ట్స్ షెడ్యూల్ను కూడా భాగ్యనగరంలోనే ప్లాన్ చేస్తోందట చిత్ర బృందం. 15 రోజులపాటు సాగే ఆ షెడ్యూల్లో కొన్ని సన్నివేశాలతో పాటు మరో పాటను కూడా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. రియల్ లైఫ్లో మేనమామ మేనల్లుళ్ళు అయిన వెంకీ, చైతూ… రీల్ లైఫ్లోనూ అవే పాత్రల్లో ఏ రేంజ్లో ఎంటర్టైన్ చేస్తారో తెలియాలంటే మరికొన్నాళ్ళు ఆగాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=bJAKvOx_UE4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























