సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు జీ మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్స్ (జీఎంబీ) సంయుక్తంగా.. 26/11ముంబై అటాక్ నేపథ్యంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వీర జవాన్ సందీప్ ఉన్ని కృష్ణన్ కథను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే కదా. మేజర్ అనే టైటిల్ తో తెరకెక్కునున్న ఈ సినిమాలో సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో గత ఏడాది గూఢచారి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అడివి శేష్ నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాపై ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అడివి శేష్ పలు అసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇది నా 11 ఏళ్ల కల అని..26/11 సంఘటన జరిగినప్పుడు నేను శాన్ ప్రాన్సిస్కో లో ఉన్నా.. కానీ అప్పుడే నేను ఉన్ని కృష్ణన్ పాత్రను చేయాలనుకున్నా.. తనని నేను సోదరుడిలా భావించాను అని చెప్పాడు. అంతేకాదు.. ఈ సినిమా కోసం మహేష్ బాబు, నమ్రత నన్ను అప్రోచ్ అయినప్పుడు నమ్మలేకపోయానన్నాడు. ఇంకా ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులను కూడా కలిసినట్టు తెలిపాడు. మరి ఈ సినిమా కోసం అడివి శేష్ ను కావాలని సెలెక్ట్ చేసుకున్నారు. చూద్దాం ఈ పాత్రకు ఎంత వరకూ న్యాయం చేస్తాడో..
[youtube_video videoid=CQ_7dQbA-HY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: