టాలీవుడ్ ప్రముఖ నటి శ్రీలీల గతేడాది స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘భగవంత్ కేసరి’, అంతకుముందు రవితేజ ‘ధమాకా’ చిత్రాలతో సాలిడ్ హిట్స్ అందుకున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాతో ఆమె మరోసారి ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.250 కోట్లు వసూళ్లు సాధించింది. ఇక గత కొంతకాలంగా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న శ్రీలీల తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోమవారం (ఫిబ్రవరి 19, 2024) ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న శ్రీలీలకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీలీల సంప్రదాయ లంగా, ఓణీలో వచ్చి స్వామివారిని దర్శించుకున్న ఆమె మొక్కులు చెల్లించుకున్నారు. ఇక స్వామి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు అమెకు వేద ఆశీర్వచనం చేయగా.. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా ఆలయం వద్ద శ్రీలీలను గమనించిన అభిమానులు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: