సాయి ధరమ్ తేజ్ ఈమధ్య కాస్త విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటూ తన అభిమానులను అలరిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే విరూపాక్ష, బ్రో సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు. ప్రస్తుతం మరో కొత్త సినిమాతో బిజీ అయిపోయాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా సాయి తేజ్ తన సోషల్ మీడియాలో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్ మళ్లీ గాంజా శంకర్ సినిమాతో మాస్ జోనర్ లో నటించడం ఎలా ఉంది అని అడగగా దానికి సాయి ధరమ్ తేజ్ సమాధానంగా మాస్ ఫిలింస్ నా ఫేవరెట్ జోనర్.. ఈ సినిమాలు నన్ను మీకు దగ్గర చేస్తాయి.. అందుకే ఈసినిమా చేస్తున్నందుకు చాలా ఎగ్జయిటింగ్ గా ఫీలవుతున్నా అంటూ తెలిపారు.
Mass films are my favourite genre…can never get enough of it because it takes me closer to you all…so I am excited beyond words https://t.co/X8N7lh5fB4
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 14, 2023
కాగా ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ చేస్తున్న సినిమా గాంజా శంకర్. సంపత్ నంది దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మ్యాడ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. రిషి పంజాబీ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























