హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అయింది. దీంతో ఇక్కడ కూడా రిలీజ్ చేయగా ఇక్కడ కూడా హిట్ అయింది.
ఈసినిమా రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే కదా. నవంబర్ 17వ తేదీన ఈపార్ట్ ను రిలీజ్ చేయనున్నారు. సప్త సాగరాలు దాటి-సైడ్ బి అంటూ తెలుగులో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు రక్షిత్ శెట్టి. ఈ సందర్భంగా తెలుగు హీరోల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మన స్టార్ హీరోలతో ఏయే జోనర్ లలో సినిమాలు తీస్తారు అన్న ప్రశ్నకు కూడా ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. తెలుగులో మీకు నచ్చిన హీరో ఎవరు అని అడగగా జూనియర్ ఎన్టీఆర్ అని ఇష్టమని తెలిపారు. ఇంకా ఛాన్స్ వస్తే ఏ యే హీరోతో ఏ జోనర్ లో సినిమాలు తీస్తారు అన్న ప్రశ్నకు.. ఎన్టీఆర్ తో మైథాలజీ జోనర్ లో, రామ్ చరణ్ తో లవ్ స్టోరీ, అల్లు అర్జున్ తో డ్యాన్స్ బేస్డ్ సినిమా, మహేష్ తో లవ్ స్టోరీ, పవర్ స్టార్ తో స్పై ఇన్వెస్టిగేషన్ బేస్డ్, ప్రభాస్ తో మైథాలజీ నేపథ్యంలో సినిమాలు తీస్తానని తెలిపారు.
కాగా ఈ సినిమాలో రక్షిత్ శెట్టి కి జోడీగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ఈసినిమాకు సంగీతం చరణ్ రాజ్ అందించారు. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: