100 కోట్ల బడ్జెట్ అయినా, 10 కోట్లు అయినా.. మైత్రీ వాళ్ళకి అదే ప్యాషన్

Directors Nandini Reddy and Neeraja Kona Praises Passion of Mythri Movie Makers

పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ‘8 వసంతాలు’ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతోంది. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. అనంతిక సనీల్‌ కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్‌ఫుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ.. “మైత్రీ మూవీ మేకర్స్ 100 కోట్లు సినిమా చేసినా 10 కోట్ల బడ్జెట్ అయినా అంతే పాషన్‌తో సినిమా తీస్తారు. అంత పెద్ద బ్యానర్ 8 వసంతాలు లాంటి యూనిక్ కథలకి ప్లాట్‌ఫామ్ అవడం అనేది ఆనందంగా ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనిపిస్తుంది. హేషం చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ గారు చాలా పాషన్‌తో ఈ సినిమా తీశారు అని అర్థమవుతుంది. ఆడియన్స్ కూడా ఆ పాషన్ ఫీల్ అవుతారు. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్” అని అన్నారు.

అలాగే మరో లేడీ డైరెక్టర్ నీరజ కోన మాట్లాడుతూ.. “మైత్రి మూవీ మేకర్స్‌కి థాంక్యూ. ఈ వేడుకలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. కంటెంట్ చాలా క్యూరియాసిటీ పెంచుతోంది. డైరెక్టర్ ఫణి గారు చాలా పాషన్‌తో సినిమా తీస్తారు. ఈ సినిమా కోసం నేను చాలా ఎదురుచూస్తున్నాను. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.