బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్తో ముందుకు దూసుకెల్తుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా మే 30న వేసవి సీజన్లో బిగ్గెస్ట్ రిలీజ్కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం థియేట్రికల్ ట్రైలర్ ఏలూరులో గ్రాండ్గా లాంచ్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు ప్రేక్షకులు హాజరైన ఈ వేడుక చాలా సక్సెస్ ఫుల్గా జరిగింది. ఏపీ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పుట్ట మహేష్, ఎమ్మెల్యేలు రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విజయ్ మాట్లాడుతూ.. “ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా ఈ సినిమాని చాలా గ్రాండ్ తీశారు మా నిర్మాత. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. మా టీమ్ అందరు నా కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తారు. మా ముగ్గురు హీరోయిన్స్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.”
“ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు బెల్లంకొండ సాయి గారికి థాంక్యూ.’ జై జానకి, రాక్షడుడు’ సినిమాలకి ఎంత రెవెన్యూ వచ్చిందో ఈ సినిమాతో అంత రెవెన్యూ రావాలని కోరుకుంటున్నాను. నారా రోహిత్ గారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆయన ఇచ్చిన సపోర్టు మామూలుది కాదు. ఇప్పటివరకు చూడని చాలా కొత్త రోహిత్ ని చూడబోతున్నారు.”
“మనోజ్ అన్న లవ్ యూ అన్న. గజపతి వర్మ ఎలా ఉంటాడో మే 30 తారీఖున థియేటర్స్లో చూస్తారు. ఇప్పటివరకు ఆయన తగ్గడమే చూశారు, ఇకపై నెగ్గడం ఎలా ఉంటుందో చూస్తారు. ఈ సినిమా తర్వాత మనోజ్ గారు ఏ ఒక్కరోజు ఖాళీగా ఉండరని గర్వంగా చెబుతున్నాను. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మే 30న ధియేటర్స్ లో కలుద్దాం బ్లాక్ బస్టర్ వైబ్ తో బయటికి వద్దాం థాంక్యూ.” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: