టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ‘పద్మ భూషణ్’ అవార్డు అందుకున్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన పద్మ అవార్డుల వేడుకలో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు మరియు అభిమానుల నుంచి అభినందనల వెల్లువెత్హుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, బాలకృష్ణ బావ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బాలయ్య అల్లుడు, ఏపీ మంత్రి నారా లోకేష్, కుమార్తె నారా బ్రాహ్మణి తదితరులు అభినందనల తెలియజేశారు. ఇంకా సినీ దర్శకులు గోపీచంద్ మలినేని, బోయపాటి శ్రీను, బాబీ, అనిల్ రావిపూడి, హీరో నారా రోహిత్ సహా మరికొందరు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక ఈ వేడుకకు బాలయ్య అచ్చ తెలుగు ఆహార్యమైన పంచె కట్టులో హాజరవడం అందరినీ ఆకర్షించింది. తండ్రి నందమూరి తారకరామారావు (సీనియర్ ఎన్టీఆర్) నట వారసుడిగా వెండితెరకు పరిచయమైన బాలకృష్ణ వటుడింతై అన్నట్టుగా ఎదిగారు. ఈ క్రమంలో గతేడాది 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. అలాగే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్గా కూడా ఎంతో మందికి సాయం అందిస్తున్నారు.
ఇక ఆయన చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం బాలయ్యకు ‘పద్మ్ఘభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాలకృష్ణకు శుభాభినందనలు తెలియజేస్తున్నారు. మరోవైపు బాలయ్యతోపాటు కోలీవుడ్ స్టార్ హీరో ‘తల’ అజిత్ కుమార్ సైతం ‘పద్మభూషణ్’ అవార్డు అందుకున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: